విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వ వహిస్తున్నారు. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శనివారం ఈ చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్ షాట్ టీజర్ను విడుదల చేశారు. ఇందులో విశాల్ పూర్తి మాస్ అవతారంలో కనిపించారు.
‘కన్నీరే నెత్తురు చిందగా..క్రోధమే రుధిరం చిమ్మగా..ఆగ్రహమే అరుణధారగా..రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఓవర్ టీజర్లో ఆసక్తిని పెంచింది. విశాల్ నటించిన గత యాక్షన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం: హరి.