Cinema News | విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్ సంతానం నిర్మాత. ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘డోంట్ వర్రీ చిచ్చా..’ అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ బాణీలు అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. శ్రీమణి సాహిత్యాన్నందించారు. యువతలో జోష్తో పాటు స్ఫూర్తిని కలిగించే గీతమిదని, చక్కటి ఫిలాసఫీతో కూడుకొని ఉంటుందని విశాల్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత చెప్పారు.