Rathnam Movie | కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా పూర్తి మాస్ అవతారంలో విశాల్ ఆకట్టుకుంటున్నాడు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ నటించిన గత యాక్షన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు హరి తెలిపారు.
Save the date for our biggie this summer 🔥#Rathnam hits the screens on the 26th of April 2024. In Tamil and Telugu.
A film by #Hari. Coming to theatres, summer 2024.
A @ThisisDSP musical. @stonebenchers @ZeeStudiosSouth @mynnasukumar @dhilipaction @PeterHeinOffl… pic.twitter.com/LZVCh2omLI
— Vishal (@VishalKOfficial) January 25, 2024