Layoffs | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశీయ ఐటీ సంస్థలకు నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాల నుంచి 70 వేల మంది సిబ్బంది వెళ్లిపోయారు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో ఐటీ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునేపనిలో పడ్డాయి. దీంతో గ్లోబల్ క్లయింట్లపై అత్యధికంగా ఆధారపడివున్న దేశీయ ఐటీ సంస్థలు సిబ్బంది వెళ్లిపోతున్న కొత్తవారిని నియమించుకోవడం లేదు. ఉన్నవారితోనే క్లయింట్లకు ఐటీ సేవలు అందిస్తున్నాయి. టాప్-5 సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాలు 69,167 మందిని కోల్పోగా..కేవలం హెచ్సీఎల్ కొంతమందిని నియమించుకున్నది. గడిచిన ఐదేండ్లలో ఇలా ఉద్యోగులు తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.
2023-24లో దేశీయ టాప్-5 ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు
టీసీఎస్ : -13,249
ఇన్ఫోసిస్ : -25,994
హెచ్సీఎల్ టెక్ : -1537
విప్రో : -24,516
టెక్ మహీంద్రా : -6945
మొత్తం : -69,167