ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణి అవుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘పుష్ప’ అద్భుత విజయం ఆమెను అన్ని భాషల ప్రేక్షకులకు చేరువచేసింది. పల్లెటూరి పడతి శ్రీవల్లి పాత్రలో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్న ఈ సొగసరి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నదని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం ర ష్మిక మందన్న ఐదుకోట్ల భారీ రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందనే వా ర్తలు వినిపిస్తున్నా యి. మరోవైపు ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ భామ ఐటెంసాంగ్లో నర్తించేందుకు సుముఖంగా లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.