Rashmika Mandanna | సినీ రంగంలో నటన ఒక్కటే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా నటీమణులు విషయంలో ఈ మాటలు బాగా వినిపిస్తుంటాయి. కొంతమంది నటీమణులు ఎన్ని సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటీ, రెండు సినిమాలకే విపరీతమైన గుర్తింపు వస్తుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని వచ్చింది రష్మిక మందన్నా. కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో’, తమిళంలో ‘సుల్తాన్’తో ఆయా ఇండస్ట్రీలలో మొదటి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ అందుకుంది. వరుస విజయాలతో దక్షిణాదిన అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికల లిస్ట్లో చేరిపోయింది.
అయితే రష్మిక బాలీవుడ్ ప్రయాణం మాత్రం ట్విస్ట్లతో సాగిపోతుంది. సౌత్లో లభించిన ఆదరణ నార్త్లో దక్కడం లేదు. ఇటీవలే ఈమె నటించిన ‘గుడ్బై’ రిలీజై డిజాస్టర్గా మిగిలింది. డెబ్యూ సినిమానే బోల్తా కొట్టడంతో రష్మిక తీవ్రంగా నిరాశపడింది. నిజానికి ఈమె డెబ్యూ ‘మిస్టర్ మజ్నూ’తో ప్లాన్ చేసుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కింది. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో ‘గుడ్బై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. గుడ్బైకి మాత్రం ఆ క్రేజ్ ఏ విధంగా కలిసి రాలేదు.
రెండవ సినిమాతో అయిన కమర్షియల్ సక్సెస్ను సాధించాలని రష్మిక ఎంతో ఆశతో ఎదురు చూసింది. కానీ ఈ సారి కూడా రష్మికకు భారీ షాక్ తగిలింది. మిస్టర్ మజ్నూ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దాంతో రష్మిక ఫుల్ అప్సట్ అయింది. బాలీవుడ్లో నటిగా తన సినీ జీవితాన్ని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నా.. విధి తనను వెనక్కు లాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈమె ఆశలన్ని ‘యానిమల్’ పైనే ఉన్నాయి. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్తంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ ఈ సినిమాతో అయిన రష్మికకు బాలీవుడ్లో హిట్టు వరిస్తుందా? లేదా? అనేది చూడాలి.