కన్నడ కస్తూరి రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా చిత్రం పుష్పలో బన్నీ సరసన కథానాయికగా నటిస్తుంది. తమిళంలోను పలు ఆఫర్స్ దక్కించుకుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గుడ్ బై సినిమా లో అమితాబచ్చన్ తో పాటు నటిస్తుంది. క్వీన్.. సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ ప్రస్తుతం అమితాబ్ మరియు రష్మికలతో గుడ్ బై సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్తో రష్మిక తొలి రోజు ఎక్స్పీరియెన్స్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఆయనతో నటించడం ఎవరికైన ఛాలెంజే. ఆయన పక్కన నిల్చుని ఫొటో దిగడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆయనతో నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఏం చేయాలో మర్చి పోయేవారు చాలా మంది ఉంటారు. సోలో పోర్షన్ ముగిసాక అమితాబ్ నటించే టైం రష్మికకు రావడంతో ఆ అమ్మడు దర్శకుడు వికాస్ తో సన్నివేశాల గురించి మరోసారి ఎక్స్ ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్ తో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసిందట
దర్శకుడు చెప్పిన సలహాలు, సూచనల ఆధారంగా ఫస్ట్ డే షూట్లో రష్మిక పాల్గొంది. ఆ సమయంలో అమితాబ్ చాలా సింపుల్గా నటించారని, ఆయనతో నటిస్తున్న సమయంలో పూర్తిగా పాత్రలో లీనం కావడం వల్ల పాత్రలు రెండు నటిస్తున్నట్లుగా అనిపించింది. అంతకు మించి ఆయన నుండి ఎలాంటి ఆందోళన రాకు ఎదురు కాలేదని.. ఆయనతో నటించడం జీవితాంతం మర్చిపోలేని విషయం అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది.