వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది కన్నడ భామ రష్మిక మందన్న. ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నదామె. ఈ నట ప్రయాణ అనుభవాలను రష్మిక తన తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. గత కొన్నేండ్లలో సినీ పరిశ్రమల్లో వచ్చిన మార్పు, పాన్ ఇండియా ట్రెండ్, తనకు ఇష్టమైన హీరోలు ..ఇలా మనసులో మాటలన్నీ చెప్పింది. రష్మిక మాట్లాడుతూ…‘పాన్ ఇండియా ట్రెండ్ మా అందరికీ గుర్తింపు తీసుకొచ్చింది. ముంబైలో నాకున్న గుర్తింపు పుష్పకు ముందు, తర్వాతగా చెప్పుకోవాలి. కన్నడ ఇండస్ట్రీ నా సొంతిళ్లు. చెన్నైలో పెరిగాను కాబట్టి ఆ నగరాన్ని అభిమానిస్తా.
ఇక హైదరాబాద్ నాకు రెండో ఇళ్లు. నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నది తెలుగులోనే కాబట్టి ఇక్కడి మనుషులు, మాల్స్, కెఫేలు బాగా పరిచయం. సాధారణ యువతిలా బయట తిరుగుతుంటా. కొందరు గుర్తుపట్టరు. మరికొందరు రష్మిక కదా అంటారు. వారికి నేను రష్మికను కాదని చెబుతా. తనకొచ్చిన కష్టాన్ని సమంత ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నది. ఆమె విషయంలో నేనొక అమ్మలా ఆలోచిస్తా. ఆమెకు తోడుగా ఉండాలనుకుంటున్నా. రామ్చరణ్, ప్రభాస్తో కలిసి నటించాలని ఉంది. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తా. ఈసారి నటిగా నేనెంత ఎదిగానో అతనికి చూపిస్తా’ అని చెప్పింది.