పాపులర్ కథానాయిక రష్మిక మందన్నా తన అభిమానులను క్షమించమని కోరింది. ఈ నేషనల్ క్రష్కు ఇన్స్టాలో 38 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. తరచూ తన సినిమా అప్డేట్లు, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం రష్మికకు అలవాటు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో ఆమె ఖాతాలో ఎటువంటి అప్డేట్లు లేకపోవడంతో అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్లు పెట్టారు.
తాజాగా ఇన్స్టాలో ఆమె పెట్టిన ఒక పోస్ట్లో తను ఆన్లైన్లోకి రాకపోవడానికి గల కారణాన్ని వివరించింది. ‘ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో షూటింగ్లో వున్నాను. అందుకే ఆన్లైన్లోకి రాలేకపోయా. అప్డేట్స్ పంచుకోలేకపోయాను. క్షమించండి. మీ అందర్ని ఎంతో మిస్సయ్యాను. ప్రస్తుతం రెయిన్బో షూటింగ్లో బిజీగా వున్నా. షూటింగ్ను, ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సెట్లో వున్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడడానికి వచ్చారు’ అంటూ అని సోషల్మీడియాలో రాసుకొచ్చింది రష్మిక.