Rashmika Mandanna In Mission majnu Movie | సౌత్లోని అగ్ర కథానాయికలలో రష్మిక ఒకరు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ సోయగం.. అనతికాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఇక గతేడాది రిలీజైన ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇటీవలే అమితాబ్తో కలిసి నటించిన ‘గుడ్బై’ సినిమా రిలీజై ఫ్లాప్గా మిగిలింది. దాంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రష్మిక కల.. కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ ‘మిషన్ మజ్ను’ చిత్రం పైనే ఉన్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ స్పై యాక్షన్ జానర్లో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజై ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాల నెలకొల్పాయి. నిజానికి రష్మిక ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేసింది. కానీ కొన్ని కారణాలతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో వచ్చే ఏడాది జనవరి 20నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో వాయిదాల తర్వాత చివరకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ సినిమాలో రష్మిక అంధురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఈమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండనుందట. ఈ పాత్ర కోసం రష్మిక సినిమా ప్రారంభానికి ముందు చాలానే రీసెర్చ్ చేసింది. అయితే ఆ సినిమా థియేటర్లో రిలీజ్ కాకపోవడం రష్మికను కాస్త నిరాశపరిచిందట. అంతేకాకుండా గుడ్బై ఫ్లాప్ అవడంతో ఈ బ్యూటీ తన ఆశలన్నీ మిషన్ మజ్ను చిత్రంపైనే పెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కావడం ఒకింత అసంతృప్తికరంగానే ఉందట. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో ‘యానిమల్’ సినిమా చేస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్బీర్ హీరోగా నటిస్తున్నాడు.