రష్మిక మందన్నా తన ఇన్స్టా ద్వారా క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ అందాలభామ ఢిల్లీలో హల్చల్ చేస్తున్నది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ లొకేషన్లోనే రష్మిక కూడా ఉన్నది. ఆ లొకేషన్లో తను ఎందుకు ఉన్నదో త్వరలో తనే సమాధానం చెబుతుందట. తన ఇన్స్టాలో లొకేషన్ ఫొటోలు షేర్ చేసి, ‘సమ్థింగ్ స్పెషల్ కోసం ఇక్కడికొచ్చా.
వివరాలు త్వరలో తెలియజేస్తా’ అంటూ కామెంట్ కూడా పెట్టేసింది నేషనల్ క్రష్. దీన్ని చూసిన అభిమానులంతా ‘ఫ్యామిలీస్టార్’లో రష్మిక స్పెషల్ రోల్ చేస్తున్నదని ఫిక్స్ అయిపోయారు. దర్శకుడు పరశురామ్, విజయ్ దేవరకొండ, రష్మిక కలయికలో వచ్చిన ‘గీతగోవిందం’ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. మళ్లీ విజయ్తో కలిసి పరశురామ్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక కూడా భాగమైతే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని దర్శకుడు పరశురామ్ భావించాడేమో అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇందులో రష్మిక ప్రత్యేక పాత్ర చేస్తున్నదా? లేక ప్రత్యేక గీతంలో నర్తిస్తున్నదా? అనేది మాత్రం తెలియాల్సివుంది. ఇందులో మృణాళ్ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే.