Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక ‘పుష్ప’తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్ట్లున్నాయి. ఆ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్లు కావడం విశేషం. ఇక రష్మిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కాగా మరోసారి ఈ అమ్మడుకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రష్మిక ఐదు సిటీల్లో 5లగ్జరీ అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. రష్మిక సంపాదన మొత్తం ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేస్తుందని, అందులో భాగంగానే ముంబై, కూర్గ్, హైదరాబాద్, గోవా, బెంగళూరులో కాస్ట్లీ అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
కాగా వీటిపై రష్మిక తాజాగా స్పందించింది. అవన్నీ అబద్ధాలని, అలాంటివి ఎవరు సృష్టిస్తున్నారో తెలియదని, అవి నిజమైతే బాగుండని వెల్లడించింది. దాంతో రష్మికపై వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ మధ్య రష్మిక వివాదాల్లో ఎక్కువగా ఇరుక్కుంటుంది. ఇదే విషయాన్ని ఇటీవలే రష్మిక ఓ ఇంటర్వూలో తను ఏం చేసినా కొందరికి నచ్చడం లేదని, ఏది మాట్లాడినా తప్పు వెతుకుతున్నారని, తనపై చాలా నెగెటీవిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపింది. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉంది.