రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్బో’. దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు శాంతరూపన్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని అమల క్లాప్నిచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ…“ఒకే ఒక జీవితం’ సినిమా తర్వాత మేము తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు.
ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఆకట్టుకునేలా సినిమాను నిర్మిస్తాం. ఈ నెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. దర్శకుడు శాంతరూపన్ మాట్లాడుతూ…‘ఈ కథను అంగీకరించిన రష్మికకు థాంక్స్. ఈ సంస్థలో ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మితమయ్యాయో చూశాం. ఈ సినిమా కూడా వాటి తరహాలోనే కొత్తగా ఉంటుంది’ అన్నారు.
నాయిక రష్మిక మందన్న మాట్లాడుతూ…‘దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. నటుడు దేవ్ మోహన్ మాట్లాడుతూ…‘తెలుగులో నా మొదటి సినిమా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంతలోనే మరో మంచి ప్రాజెక్ట్ దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కే.ఎం. భాస్కరన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్