సోషల్మీడియా ప్రభావం ఎక్కువైన దగ్గరి నుంచి సినీ తారల్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం, వారు చేసే ప్రతి పనిని విమర్శనాత్మక కోణంలో చూడటం పెరిగిపోయింది. తాను కూడా ఈ ట్రోల్స్ బారిన పడి నిద్రలేని రాత్రుల్ని గడిపానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో ఈ భామ లిప్లాక్ సన్నివేశాలపై ట్రోల్స్ బాగా వచ్చాయట. ఈ విషయాన్ని గుర్తుతెచ్చుకొని ఎమోషనల్గా ఫీలైంది రష్మిక. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలి రోజులు కాబట్టి విమర్శల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసేది కాదు.
స్వతహాగా నేను సున్నిత మనస్కురాలిని కావడం వల్ల నాపై విమర్శల్ని తట్టుకోలేకపోయా. ఒక్కోసారి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. పీడ కలలతో రాత్రంతా భయం భయంగా గడిపేదాన్ని. నా జీవితంలో అత్యంత కఠినమైన ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పింది. అయితే తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన మనోధైర్యంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని కెరీర్పై దృష్టిపెట్టానని రష్మిక మందన్న పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.