ముంబై : నవరాత్రి వేడుకల్లో (Navratri Celebrations) దుర్గా మాత మంటపాలను బాలీవుడ్ భామలు సందర్శిస్తుండటంతో సినీ అభిమానుల సందడితో పలు ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. సంప్రదాయ దుస్తులతో మెరిసిపోతూ బాలీవుడ్ హీరోయిన్లు వివిధ దుర్గామాత మంటపాలను సందర్శించి పూజలు చేస్తున్నారు.
ఓవైపు స్టైలిష్ లుక్ అదరగొడుతూనే ట్రెడిషనల్ లుక్లో అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఎవర్గ్రీన్ డ్రీమ్ గర్ల్ హేమ మాలిని కాంచీవరం సిల్క్ శారీలో కాంతులీనగా, ఆమె కూతురు ఈషా డియోలో క్రీం కలర్ అవుట్ఫిట్తో అభిమానులను క్లీన్బౌల్డ్ చేశారు.
ఇక రాణీ ముఖర్జీ మెటాలిక్ సెమీ ట్రాన్స్పరెంట్ శారీతో, మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో సందడి చేశారు. ఇక కియారా అద్వానీ మింట్ గ్రీన్ కుర్తాలో మెరిసిపోయారు. కాజోల్ పింక్ శారీ, మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్లో ఆకట్టుకున్నారు. సుస్మితా సేన్, శార్వరి వాగ్ కూడా కలర్ఫుల్ డ్రెస్సింగ్స్తో అభిమానులను ఖుషీ చేశారు.
Read More :