‘యానిమల్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రణ్బీర్కపూర్. ప్రస్తుతం ఆయన పౌరాణిక ఇతిహాసం రామాయణం కోసం సన్నద్ధమవుతున్నారు. నితేష్ తివారి దర్శకత్వంలో పాన్ ఇండియ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సీత పాత్రలో సాయిపల్లవి నటించనుంది. కన్నడ అగ్ర హీరో యష్ రావణాసురుడి పాత్రను పోషించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేశారు. రాముడి పాత్ర కోసం రణ్బీర్కపూర్ విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఫొటోలను ఆర్చరీ కోచ్ తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో ‘రామాయణం’ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నదని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం రణ్బీర్కపూర్..సంజయ్లీలా భన్సాలీ రూపొందిస్తున్న మల్టీస్లారర్ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.