ముంబై: హిందువుల సెంటిమెటును దెబ్బతీశాడంటూ బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్పై (Ranbir Kapoor) ఇద్దరు లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న కపూర్ ఫ్యామిలీ అంతాకలిసి ముంబైలోని కునాల్ కపూర్ ఇంట్లో క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రణ్బీర్ కపూర్తోపాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ మతంలో ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు.
అయితే రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించారని, జై మాతా ది అనే నినాదాలు చేశారని సంజయ్ తివారీ ఆరోపించారు. ఈ మేరకు తన లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాతో కలిసి ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రణబీర్ కపూర్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నినాదాలు చేశారని, తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదుకాలేదు.