Ranbir Kapoor | బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ను డైరెక్టర్స్ డ్రీమ్ హీరో అంటుంటారు. ఎందుకంటే రణ్బీర్ కపూర్ ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చాక.. డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తాడట, సినిమా కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాడట. కాగా తాజాగా యానిమల్ కోసం కూడా అలాంటి ఓ గొప్ప పని చేశాడట. అదేంటంటే, రణ్బీర్ కపూర్ యానిమల్ సినిమా కోసం తన రెమ్యునరేషన్లో సగం వెనక్కు ఇచ్చేశాడట. పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ పెంచడానికి తన రెమ్యునరేషన్ను సగానికి తగ్గించుకున్నాడట. సినిమా హిట్టయి భారీ లాభాలు తెచ్చిపెడితే.. అందులో షేర్ను తీసుకోనున్నాడట. ఇలా సినిమా కోసం రెమ్యునరేషన్ను తగ్గించుకోవడం అంటే సినిమాపై ఆయనకున్న డెడికేషన్ ఏంటో అర్థమయిపోతుంది.
ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు ఇప్పటికీ రణ్బీర్ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అంతలోనే రీసెంట్గా టీజర్ను రిలీజ్ చేసి చిన్నపాటి విధ్వంసమే సృష్టంచాడు.
తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ను డీప్గా చూపించబోతున్నట్లు టీజర్తో క్లారిటీ ఇచ్చాడు. సాత్వికంగా ఉండే రణ్బీర్ కొన్ని కారణాల వల్ల జంతువులా మారి శత్రువులను చీల్చీ చెండాడుతూ ఉంటాడు. క్రిమినల్ను కన్నామంటూ అనీల్ కపూర్తో రణ్బీర్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పించాడు. కొన్ని షాట్స్ అయితే ప్యూర్ గూస్బంప్స్ స్టఫ్లానే అనిపించాయి. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.