Ramayanam Movie | ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన దృష్ట్య కావ్యం రామాయణం. ఈ ఇతిహాస కథతో ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. అయినా కానీ మళ్లీ కొత్తగా సినిమానో, సీరియల్లో వస్తుందంటే అమితాసక్తితో ఎదురు చూస్తుంటాం. తరాలు మారినా ఈ కథనుకున్న డిమాండ్ అలాంటింది. ఇక ఇటీవలే ఆదిపురుష్ అంటూ మోషన్ క్యాప్చర్తో సినిమా తీసి నవ్వులపాలయ్యారు చిత్ర బృందం. రామాయణం కథను ఎలా చూపించొద్దో తెలియాలంటే.. ఆదిపురుష్ చూస్తే సరిపోతుందని ఈ సినిమాపై ఎంతో మంది తీవ్ర విమర్శలు చేశారు. దెబ్బకు చిత్ర యూనిట్ సైతం సైలెంట్ అయిపోయింది. ఈ సినిమా ఫలితం తర్వాత రామాయణం కాన్సెప్ట్తో సినిమా తీయాలంటే ఏళ్లు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ దంగల్ దర్శకుడు నితీష్ తీవారి మరోసారి ఈ ఇతిహాస కథను తెరపైకి తీసుకురాడానికి రెడీ అయ్యాడు.
రణ్బీర్ కపూర్ను రాముడిగా చూపిస్తూ నితీష్ ఈ సినిమా చేయబోతున్నాడు. సీత పాత్ర కోసం ఎంతో మంది పేరు పరిశీలనలో ఉంచుకున్నా.. ముందుగా అనుకున్న సాయిపల్లవినే ఫిక్స్ చేశారని ఇన్సైడ్ టాక్. ఇక రావణాసురిడిగా రాకీ భాయ్ యష్ నటించబోతున్నాడు. ఇది గతంలో అనుకున్న కాస్టింగ్ అయినప్పటికీ.. మధ్యలో యష్ ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశాడని, ఆలియాభట్ హీరోయిన్గా నటించనుందని బోలెడు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవమని హిందీ మీడియా రాసుకొచ్చింది. ఇక ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో మూడు పార్టులుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక తొలిపార్టు సీతారాముల బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసి క్లైమాక్స్లో లంకాధిపతి రావణుడిని చూపించనున్నారట. రెండో భాగంలో సీతాపహరణం, రామ-రావణ యుద్దం, మూడో పార్టులో లవ-కుశల జననం.. ఇలా రామాయణ కథను మొత్తం చూపించబోతున్నారట. అల్లు అరవింద్, మధు మంతెన ఈ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ స్కేల్పై నిర్మించబోతున్నారట.