రామ్తేజ్, గరిమ జంటగా పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అక్షయ్కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్నివ్వగా, రామసత్యనారాయణ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఓ యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడన్నదే చిత్ర కథాంశం’ అన్నారు. త్వరలో చీరాలలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత పీవీఆర్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శబరినాథ్, సంగీతం: రాజా, నిర్మాత: పీవీఆర్, రచన-దర్శకత్వం: అక్షయ్కృష్ణ నల్లం.