దర్శకుడు శంకర్ సినిమాల్లో కథాంశాలపరంగా వైవిధ్యం, సామాజిక సందేశంతో పాటు హీరోల పాత్రల్ని భిన్న పార్శాల్లో ఆవిష్కరించడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన రామ్చరణ్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా అగ్రనిర్మాత దిల్రాజు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే వార్తలొచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తున్నది. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్చరణ్ కనిపిస్తారని..అందులో ఓ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్తో సాగుతుందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. తనదైన పంథాలో సామాజికాంశాల్ని స్పృశిస్తూ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారని తెలిసింది.