Ramayan | భారతీయ పౌరాణిక కథ రామాయణం. హిందువులు ఇష్టపడే, గౌరవించే పురాతన పౌరాణిక కథ. ‘రామాయణం’ పేరు వినగానే అందరికీ రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీనియర్ అందరికీ కళ్ల ఎదుట నిలుస్తుంది. 1980 నాటి ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. సీరియల్ వచ్చే సమయంలో రోడ్లపై నిశ్శబ్దం అలుముకునేది. దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్లోని పాత్రలపై చర్చలు జరిగేవంటే ఎంత ప్రజాధరణ పొందిందో తెలుస్తుంది. ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో మళ్లీ ఈ సీరియల్ను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్ ఎపిసోడ్లు రికార్డ్స్థాయిలో టీఆర్పీని సాధించింది. తాజాగా ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఆ రికార్డు ఏంటో ఓ సారి తెలుసుకుందా రండి..!
సీరియల్లో లక్ష్మణుడిగా పాత్రలో నటించిన సునీల్ లాహిరి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ మూడు సంవత్సరాల కిందట అంటే ఏప్రిల్ 16, 2020న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్లో రాముడి సోదరుడు లక్ష్మణుడు, రావణుడి తనయుడు మేఘనాథుడికి మధ్య జరిగే యుద్ధం ఎపిసోడ్ ప్రసారం కాగా.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దాదాపు 77.7 మిలియన్ల మంద్రి ప్రేక్షకులు వీక్షించారు. ఇదో ప్రపంచ రికార్డు. ఈ సందర్భంగా సునీల్ లాహిరి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియోను రిలీజ్ చేశారు.
‘సరిగ్గా ఈ రోజు అంటే.. ఏప్రిల్ 16, 2020 రోజు రామాయంలోని లక్ష్మణుడు, మేఘనాథుడి మధ్య జరిగిన యుద్ధం ఎపిసోడ్ యుద్ధం ఎపిసోడ్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఇది చారిత్రాత్మకమైన మైలురాయి. 7.7కోట్ల మంది ప్రేక్షులకు ధన్యవాదాలు. మీ వల్లే ఈ ఘనత సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. లక్ష్మణ్నుడి పాత్రలో సునీల్ లాహిరి, మరో వైపు మేఘనాథుడి పాత్రలో విజయ్ అరోరా తమ తమ పాత్రల్లో జీవించారు. 1980ల్లో ప్రసారమైన ఈ రామానంద్ సాగర్ ‘రామాయణం’ నేటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నది. ఈ దృశ్యకావ్యంలో పాత్రలు పోషించిన నటీనటులందరికీ చిరస్థాయిగా గుర్తింపొందారు. ఈ సీరియల్లో అరుణ్ గోవిల్ రాముడిగా, సీతగా దీపికా చిఖ్లియా, రావణుడిగా అరవింద్ త్రివేది, హనుమంతుడిగా ధారాసింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.