Ramayan | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ రాణా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ్. దాదాపు రూ.800కోట్ల బడ్జెట్తో మూడు భాగాల్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనున్నది. ఇప్పటికే లుక్కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవగా.. వైరల్గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. మూవీ పేరును మార్చబోతున్నట్లు తెలుస్తున్నది. లీగల్ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
అల్లు అరవింద్, మధు మంతెన బృందం ప్రైమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సినవి ఇంకా చెల్లించలేదని.. అందుకే సినిమా నిర్మించడానికి వీల్లేందంటూ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తున్నది. అయితే, దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో సినిమా టైటిల్ను మార్చబోతున్నారని.. మరో వర్కింగ్ టైటిల్ను సైతం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ముంబయిలోని ఫిల్మ్ సిటీలో షూటింగ్ని నిలిపివేసినట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే, అల్లు అరవింద్, మధు మంతెన చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారని.. కొత్త నిర్మాతల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తున్నది. ప్రైమ్ ఫోకస్ సినిమా విడుదలపై కొన్ని విదేశీ సంస్థలతో మాట్లాడిందని టాక్. ఇన్వెస్టర్లు ఎవరూ దొరకపోవడంతో పూర్తిస్థాయిలో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రా రణబీర్ కపూర్కి నిర్మాతగా ఆఫర్ ఇవ్వగా.. ఇందుకు సిద్ధంగా రణబీర్ లేడని సమాచారం.
ఇక కన్నడ నటుడు యష్ మూవీకి కో ప్రొడ్యూసర్గా మారాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ లారాదత్తాతో పాటు ‘రామాయణం’ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ సైతం నటించనున్నట్లు తెలుస్తున్నది. లుక్ టెస్ట్కి సంబంధించి ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ మూవీలో హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తారని ప్రచారం జరుగుతండగా.. మూవీకి సైన్ చేయలేదని సమాచారం. ఇక మూవీలో ‘ది కేరళ స్టోరీ’ నటి సోనియా బలానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.