మాస్ మహరాజా రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు. రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ మూవీ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. రమేష్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
చిత్రంలో గవర్నమెంట్ ఆఫీసర్గా నటిస్తున్నాడు రవితేజ. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీని మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఫిబ్రవరి లో ఖిలాడీ, మార్చిలో రామారావు ఆన్ డ్యూటీ. వరుస నెలలో రవితేజ రెండు సినిమాలతో సందడి చేయనుండడం విశేషం. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో థమాకా అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితే. ఈ మూవీతో పాటు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 2022లో మొదలు కానుంది. ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.