ఈ ఏడాది క్రాక్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ త్వరలో ఖిలాడీ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో రామారావు ఆన్ డ్యూటీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రజిష విజయన్ మరియు దివ్యాన్ష కౌశిక్ లు రవితేజ సరసన ఆడి పాడనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా నేడు ప్రకటించడం జరిగింది.
రామారావు ఆన్ డ్యూటీ కి సంబందించి విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానులలో సరికొత్త ఆనందాన్ని అందించాయి. రవితేజ ను మరొకసారి మాస్ పెర్ఫార్మెన్స్ లో చూసేందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.