‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇదే ఊపులో ఆయన తదుపరి సినిమాలకు సన్నద్ధమవుతున్నారు. రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ఇండియా చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. నిర్మాత మాట్లాడుతూ ‘రామ్తో ప్రస్తుతం ‘వారియర్’ సినిమా చేస్తున్నాం. మా తదుపరి ప్రాజెక్ట్ కూడా ఆయనతో కుదరడం ఆనందంగా ఉంది. మా సంస్థకు ప్రతిష్టాత్మక చిత్రమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్కుమార్.