chandrababu cries | ఏపీ అసెంబ్లీలో ఎన్నడూ లేనంత ఉద్విఘ్నమైన వాతావరణం ఏర్పడింది. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితం ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇన్ని రోజులు తనను మాత్రమే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు తన కుటుంబాన్ని, తన భార్యను కూడా ఈ డర్టీ పాలిటిక్స్లోకి లాగారంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. మళ్లీ తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని.. అప్పటి వరకు అసెంబ్లీ మొహం కూడా చూడనంటూ శపథం చేసి బయటికి వెళ్లాడు చంద్రబాబు నాయుడు.
ఈ ఏడుపు చూసిన తర్వాత తెలుగుదేశం నాయకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తమ నాయకుడిని ఏడిపించిన వైఎస్ జగన్ అంతకంతా అనుభవిస్తాడు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టిన విజువల్ తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆ మధ్య అయితే వర్మ పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును టార్గెట్ చేస్తూ సినిమాలు తీశాడు ఆర్జీవీ. కానీ కొద్దిరోజులుగా ఆర్జీవీ సైలెంట్ అయ్యాడు.న మళ్లీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ సడన్గా మళ్లీ టార్గెట్ చేశాడు. తాజాగా ఆర్జీవీ నుంచి పవర్ స్టార్ / ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఓ సినిమా వస్తుంది.
The @nccbn just watched RGV MISSING trailer https://t.co/4sjLUhkTL3 Thank u for ur reaction sir 🙏 pic.twitter.com/PYMJYmhQWu
— Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2021
షూటింగ్ ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ తాజాగా ఈ సినిమా ట్రైలర్ వదిలారు. మళ్లీ పవన్, చంద్రబాబుల డూప్స్ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూసి చంద్రబాబు కంటతడి పెట్టుకున్నాడు అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వర్మ. దానికి ఆయన థాంక్యూ కూడా చెప్పాడు. చంద్రబాబు ఈ సినిమా ట్రైలర్ చూసి బాగా ఎమోషనల్ అయ్యాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఏడుపును కూడా తన సినిమా కోసం అలా వాడేసుకున్నాడు ఈ సంచలన దర్శకుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భార్యపై విమర్శలు.. వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు..
సీఎం అయ్యాకే సభలో అడుగు పెడుతా.. చంద్రబాబు శపథం
చంద్రబాబు ఏడుపుతో నేను చాలా హ్యాపీ.. రోజా సంచలన వ్యాఖ్యలు
కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించలేదు.. బాబు డ్రామలాడుతున్నారు : ఏపీ సీఎం జగన్