రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. రాజకీయ, సామాజికాంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు ‘సీఈఓ’ అనే టైటిల్ను ఖరారు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్చరణ్ యువ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలావుండగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులో పదికోట్ల వ్యయంతో హైదరాబాద్లో వేయనున్న భారీ సెట్లో ఓ పాటను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
ప్రభుదేవా నృత్య దర్శకత్వం వహించనున్న ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. మార్చి 27న రామ్చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్లుక్ ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.