యుగాంతం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బెదురులంక -2012’. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మాత. ఆగస్టు 25న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను గ్లోబల్స్టార్ రామ్చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. కథలో కొత్తదనం వుందనిపిస్తుంది.కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు.
ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచలోకి తీసుకువెళ్తుంది. గోదావరి నేపథ్యంలో సినిమాలకు ఇదొక బెంచ్మార్క్ సెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో జరిగే కథ ఇది. యుగాంతం పేరుతో కొందరు మోసగాళ్లు ప్రజలను భయపెట్టి దేవుడి పేరుతో దోపిడి చేస్తుంటే వారిని కాపాడానికి శివశంకర వరప్రసాద్ (హీరో) ఏం చేశాడు అనేది కథ. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.