అగ్ర హీరో రామ్చరణ్ నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన మిత్రుడు, యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్ రెడ్డితో (విక్కీ) కలిసి ‘వి మెగా పిక్చర్స్’ పేరుతో కొత్త బ్యానర్కు శ్రీకారం చుట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్చరణ్ ఇప్పటికే ఓ ప్రొడక్షన్ హౌస్ను నడుపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా’ ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ వంటి భారీ చిత్రాల్ని తెరకెక్కించారు.
తాజాగా ఆరంభించిన బ్యానర్లో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహిస్తూ, వినూత్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించబోతున్నారుమని రామ్చరణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు మెచ్చేలా మా సంస్థ చిత్రాల్ని రూపొందిస్తుంది. సరికొత్త సృజనాత్మక ఆలోచనలకు వేదికగా ఈ బ్యానర్ను తీర్చిదిద్దుతాం’ అన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు.