రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల నేపథ్య కథ ఇది. కియారా అద్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. ఇటీవలే హైదరాబాద్ పాతబస్తీలో చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరించారు. ప్రస్తుతం కర్నూల్లో షూటింగ్ జరుగుతున్నది. రామ్చరణ్ పాల్గొనగా యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం వైజాగ్లో మరో కీలక షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు.