టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. అందులో కొన్ని మల్టీ స్టారర్స్గా రూపొందుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే తమిళంలో హిట్ అయిన రాక్షసన్’ అనే తమిళ చిత్రాన్ని ”రాక్షసుడు” పేరుతో తెలుగులో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టిన మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుందని మేకర్స్ తెలిపారు. అయితే హీరోలు ఎవరనే విషయంపై మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఇందులో స్టార్ హీరో నటిస్తాడు అని ఇటీవల చెప్పుకొచ్చాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందే ‘రాక్షసుడు’ సీక్వెల్ లో ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారని తెలుస్తోంది. ”రాక్షసుడు 2” చిత్రం కోసం కోలీవుడ్ స్టార్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ని సంప్రదించారని టాక్. ఇప్పుడు ఆయనకు అన్ని భాషలలో క్రేజ్ ఉంది కాబట్టి విజయ్ని ఈ ప్రాజెక్ట్కి తీసుకోవాలని అనుకుంటున్నారట. మరో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో ఉంటారని సమాచారం.
ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ చిత్రాన్ని రూపొందించనున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా కలిసి ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు.