నవీన్ బేతిగంటి, అన్వేష్మైఖేల్, పవన్మ్రేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షసకావ్యం’. దామురెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ టైటిల్ వీడియోను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ‘ఒక్క మాట యాది ఉంచుకో బిడ్డా. మనసంటోళ్లు పది మంది చచ్చిపోయినా ఎవ్వరికి ఫరక్ పడదు..కానీ ఒక్కడు సదువుకుంటే మనసంటోళ్లను వందమందిని బతికిస్తడు’ అనే డైలాగ్ ఆసక్తిని కలిగిస్తున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘1990 బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. పీరియాడికల్ సోషల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నాం. వక్ర మార్గంలో పయనించిన కొందరిలో ఎలా పరివర్తన వచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. దయానంద్రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్రాజు, శ్రీకాంత్, సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం.