బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే సామ్రాట్ పృథ్విరాజ్లో నటించగా…బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). అక్షయ్ చేస్తున్న చిత్రాల్లో ఒకటి రక్షాబంధన్ (Raksha Bandhan). ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా రిలీజ్కు ముందే ఈ చిత్రం అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. రక్షా బంధన్ ట్రైలర్ ప్రతిష్టాత్మక దుబాయ్ ఫెస్టివల్ సిటీలో స్క్రీనింగ్ కానుంది. ఇండియా నుంచి దుబాయ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ కాబోతున్న తొలి సినిమా కావడం విశేషం. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
జీస్టూడియోస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. సాహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.