బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ జోరుకు కరోనా కళ్లెం వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్టులు ఉండగా, ఇవి వాయిదా పడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘రక్షా బంధన్’ అనే సినిమా స్టార్ట్ చేసారు. అక్షయ్ కుమార్ తన కెరీర్లో తొలిసారి అన్నా చెల్లెల్ల సెంటిమెంట్తో ‘రక్షా బంధన్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ నలుగురు చెల్లెల్ల అన్నయ్యగా కనిపించనున్నారు.
చిత్రంలో నానా పటేకర్ .. అక్షయ్ కుమార్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. భూమి పెడ్నేకర్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి ముంబై షెడ్యూల్ పూర్తి చేశాడు అక్షయ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ బిహైండ్ ది సీన్కు ( లొకేషన్ స్టిల్స్) సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇవి నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అక్షయ్ నటించిన బెల్ బాటమ్, సూర్య వంశీ , భారతీయ చారిత్రక యోధుడు ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్రపై చేస్తున్న ‘పృథ్వీరాజ్’ అనే సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
రామ్ సేతు అనే సినిమా కూడా చేస్తున్నారు అక్షయ్. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి.