బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం రక్షాబంధన్ (Raksha Bandhan). ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు జోడీగా టాయిలెట్ ఫేం భూమి పెడ్నేకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. గత నాలుగు రోజుల్లో రక్షా బంధన్ బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్లు వసూళ్లు చేసినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాతో పోలిస్తే మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించారు. రక్షాబంధన్ లో సాహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్ కీలక పాత్రల్లో నటించారు.
హిమేశ్ రేష్మియా మ్యూజిక్ కంపోజర్గా వ్యవహరించిన రక్షాబంధన్ రక్షా బంధన్ ట్రైలర్ ప్రతిష్టాత్మక దుబాయ్ ఫెస్టివల్ సిటీలో స్క్రీనింగ్ అయ్యే అరుదైన అవకాశం అందుకుందని ఇప్పటికే ఓ అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో ఇండియా నుంచి దుబాయ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ కాబోతున్న తొలి సినిమాగా అరుదైన రికార్డు రక్షాబంధన్ ఖాతాలో చేరినట్టైంది.