పాయల్ రాజ్పుత్.. ఈ పేరు వింటేనే యువతలో ఎక్కడలేని ఆసక్తి. ‘ఆర్ఎక్స్100’ నుంచి ఆ ఆసక్తి కొనసాగుతూనేవుంది. రీసెంట్గా తను కథానాయికగా నటించిన ‘మంగళవారం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ గురించి పాయల్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యి. ‘ఎవరైతే రావాలని మనం బలంగా కోరుకుంటామో.. వాళ్లనే ప్రకృతి మన ముందుంచుతుంది.
ఇది నిజం.. ఇప్పుడు అల్లు అర్జున్సార్ మనముందు ఉన్నారంటే కారణం అదే. మా వేడుకకు వచ్చినందుకు థ్యాంక్యూసార్’ అంటూ.. కాస్త ఇబ్బంది పడుతూ.. ‘ప్లీజ్ సార్ మీరు నన్ను అలా చూడొద్దు. మిమ్మల్ని చూడగానే నేను బ్లాంక్ అయిపోయాను. నా నోటి వెంట మాటలు రావడంలేదు. నేనేం చేస్తున్నానో అర్థం కావడంలేదు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్లో మీకు కొన్ని విషయాలు చెప్పాను. మళ్లీ అవన్నీ గుర్తొస్తున్నాయి’ అంటూ పరవశిస్తూ మాట్లాడింది పాయల్. ఇంతకీ ఆ ట్రైలర్ లాంచ్లో బన్నీకి ఏం చెప్పుంటుంది? అనేది ఇప్పుడు అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.