సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరు హీరోగా నటిస్తున్న చిత్రం ‘11:11’ వర్ష విశ్వనాథ్ నాయిక. ఆర్కే నల్లూరి దర్శకుడు. గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత. ఇటీవల ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం’ అనే యూత్ఫుల్ సాంగ్ను యువ కథానాయకుడు రామ్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ ఓ అందమైన ప్రేమకథకు మర్డర్ మిస్టరీని జత చేసి ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని రూపొందించాం. ప్రతి సన్నివేశం ఆడియన్స్కు థ్రిల్లింగ్ను కలిగిస్తుంది’ అన్నారు. రోహిత్, కోటి సాలూరు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.