Rajinikanth | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినప్పటికీ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల కొరత, కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాదు పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు.
ప్రముఖ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రజినీకాంత్ ఇంటి వద్ద వరదనీటికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Poes Garden near @rajinikanth house @Savukkumedia @SavukkuOfficial #ChennaiFloods2023 #ChennaiRains2023 #chennaicyclone #சென்னையை_மீட்ட_திமுக pic.twitter.com/tHiYTrFsW2
— Abdul Muthaleef (@MuthaleefAbdul) December 6, 2023
మరోవైపు వరద బాధితులకు రజనీకాంత్ రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. నటులు సూర్య, ఆయన సోదరుడు కార్తీ కూడా రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. పలువురు సినీ తారలు వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యావసరాలు వంటి సాయం అందజేస్తున్నారు.
Also Read..
Chennai Rains | ఇంకా వరద గుప్పిట్లోనే చెన్నై.. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
Mizoram | మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం
KCR | కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు