తిరుమల : తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని రజనీకాంత్ కుమార్తెలు (Rajinikanth Daughters) ఐశ్వర్య, సౌందర్య బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొని గర్భాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
అదేవిధంగా టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్(Viswaksen), గామి చిత్రయూనిట్తో బుధవారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న విశ్వక్ సేన్, నటి చాందిని చౌదరి, ఇతర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం గామి. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
విద్యాధర్ కాగిత ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.