రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. గత నెల రోజులుగా హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రజనీకాంత్, నయనతారతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. సోమవారం ఆయన చెన్నైకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈసినిమాలో కీర్తిసురేష్, మీనా, ఖుష్బూ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్య కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చెన్నైలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసిన తర్వాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూన్ నెలలో రజనీకాంత్ అమెరికాకు బయలుదేరనున్నట్లు తెలిసింది.