సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘పిఠాపురంలో..అలా మొదలైంది’. మహేష్చంద్ర దర్శకుడు. ఈ నెల 18న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యువతరానికి మంచి సందేశం అందించే చిత్రమిదని, సెంటిమెంట్తో పాటు చక్కటి వినోదం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని మేకర్స్ పేర్కొన్నారు. పృథ్వీరాజ్, కేదార్శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీసీ క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మహేష్చంద్ర.