Shilpa Chowdary | కిట్టీ పార్టీల పేరుతో టాలీవుడ్ ప్రముఖులను, ఇతరులను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు అయింది. శిల్పా చౌదరికి మూడు కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయింది. రాజేంద్రనగర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ.. కొన్ని షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. ప్రస్తుతం శిల్పా చౌదరి చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేపు చంచల్ గూడ జైలు నుంచి శిల్పా చౌదరి విడుదల కానుంది.
కిట్టీ పార్టీల పేరుతో ధనవంతులు, సినిమా సెలబ్రిటీలకు మాయ మాటలు చెబుతూ మోసం చేయడమే శిల్పా చౌదరి స్పెషాలిటీ. ఇప్పటి వరకు శిల్పా చౌదరి అలా 200 కోట్ల వరకు మోసం చేసి సంపాదించినట్లు తెలుస్తోంది. తన బండారం బయటపడటంతో పోలీసులు తనను అరెస్ట్ చేసి తీగ లాగడంతో డొంకంతా కదిలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shilpa Chowdary | శిల్పా చౌదరికి చేతిలో మోసపోయిన యంగ్ హీరో
shilpa Chowdary | శిల్పా చౌదరికి చేతిలో మోసపోయిన మహేశ్ బాబు చెల్లెలు