బాహుబలి చిత్రం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ జనవరి 7న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలు సిటీలలో ప్రెస్ మీట్స్ పెడుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. ఆయనకు రీసెంట్గా మహేష్ సినిమాకు సంబంధించి ప్రశ్న ఎదురైంది.
మహేష్ బాబు సినిమా గురించి విలేకరి ప్రశ్నించగా, ఆర్ఆర్ఆర్ సినిమా సందర్భంలో ఆ ప్రాజెక్ట్ కోసం మాట్లాడడం సరి కాదని ఈ సినిమా సక్సెస్ అంతా అయ్యిపోయిన తర్వాత ఆ సినిమా కోసం మాట్లాడుకుందాం అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్ 29వ సినిమా ట్యాగ్ కూడా ఇండియన్ వైడ్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోను హీరోగా నటిస్తారు మహేష్ . ఈ రెండు చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక గురించి ఫిల్మ్నగర్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో విలన్ క్యారెక్టర్కు హీరో విక్రమ్ పేరును పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజ్ నిర్మించినట్టు తెలుస్తుంది.