దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు.
‘‘కొన్ని చిన్న చిన్న షాట్స్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. 2018 నవంబరు 19న ఏదైతే బైక్ షాట్తో చిత్రీకరణ ప్రారంభించామో.. యాదృచ్ఛికంగా అదే బైక్ షాట్తో షూట్ పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది.
సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇద్దరు హీరోలు గెటప్ మార్చుకుంటారేమోనంటూ వార్తలు వస్తున్నాయి. కాని తన హీరోలకు జక్కన్న ఓ కండీషన్ పెట్టాడట. తను చెప్పే వరకు గెడ్డాలు తీయవద్దని దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలకు క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. టోటల్ అవుట్ పుట్ ను తాను చూసి, ఓకె అనుకునే వరకు గెడ్డాలతోనే ఉండాలన్నది రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది.