ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాతో బాక్సాపీస్ను షేక్ చేశాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులకు వెకేషన్ కోసం యూఎస్ వెళ్లాడు జక్కన్న. తాజాగా క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి హైదరాబాద్కు తిరిగి వచ్చేశాడట. అంతేకాదు తన నెక్ట్స్ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా షురూ చేసినట్టు ఓ వార్త ఇపుడు ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది. జక్కన్న రాస్తున్న స్క్రిప్ట్ ఎవరికోసమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులను తన రైటర్తో కలిసి మొదలుపెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లేముందు..కథ రెడీ కావాల్సి ఉండటంతో ఆ దిశగా జక్కన్న ప్లాన్ చేసకుంటున్నాడట. అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది.
మొత్తానికి సర్కారు వారి పాట సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ రావడంతో వారంతా ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు. యూరప్ ట్రిప్ లో ఉన్న మహేశ్ జూన్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోయే సినిమాను మొదలుపెట్టబోతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక జక్కన్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.