పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుంద్రా అప్పటి నుండి బయట కనిపించడమే మానేశాడు. సోషల్ మీడియా అకౌంట్స్ కూడా తొలగించాడు. అయితే చాలా రోజుల తర్వాత రాజ్ కుంద్రా తన భార్యతో చెట్టాపట్టాలు వేస్తూ కనిపించారు. తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. భార్య శిల్పాశెట్టితో కలిసి ఆలయాన్ని సందర్శించారు రాజ్. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఈ దంపతులు ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసారు.
అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపించారు. ప్రస్తుతం శిల్పాశెట్టి,రాజ్కుంద్రా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజ్ కుంద్రా సోషల్ మీడియా ఖాతాలన్నింటిని తొలగించినప్పటికీ, శిల్పాశెట్టి మాత్రం ఫిట్నెస్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. తన అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా శిల్పా వారి పిల్లలు వియాన్ రాజ్ కుంద్రా, సమీషా శెట్టి కుంద్రాలతో కలిసి ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. తమ యాత్రకు సంబంధించిన గ్లింప్స్ను శిల్పా శెట్టి పంచుకుంది. ఇక రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జూలైలో అరెస్టయిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CWDFoC8r27R/?utm_source=ig_web_copy_link