ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్కి అవార్డులు, గుర్తింపులు కొత్తేమి కాదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన ట్యూన్ చేసిన పాటకు అరుదైన గౌరవం లభించింది. గుల్జార్ రాసిన పాటను ‘మేరీ పుకార్ సునో’ పేరుతోఇటీవల కంపోజ్ చేసారు ఏఆర్ రెహమాన్. ఈ పాటని ఆరుగురు గాయనీమణులే పాడారు. ప్రజలంతా ధైర్యాన్ని కోల్పోయిన వేళ.. వారిలో జారిపోయిన స్థైర్యాన్ని పెంచేందుకు తోడ్పాటు అందించేలా ఈ పాట ఉందని చెప్పాలి.
భూమాత తన పిల్లలకు ధైర్యం చెప్పినట్టు ఈ పాట ఉండగా, ఈ పాటలకు విపరతీమైన ఆదరణ లభిస్తుంది. ఈ పాటకు ఉత్తరాది.. దక్షిణాది గాయనీ గాయకులైన చిత్ర.. శ్రేయాఘోషాల్.. అల్కా యాగ్నిక్.. సాధనా సర్గమ్.. షాషా తిరుపతి.. అర్మన్ మాలిక్.. ఆషిఫ్ కౌర్ ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు యూ ట్యూబ్ లో కోటిన్నరకు పైనే వ్యూస్ వచ్చాయి. రీసెంట్గా ఈ పాటను లాస్ ఏంజెల్స్.. న్యూయార్క్ సిటీలో బిల్ బోర్డులో డిస్ ప్లే చేశారు. గతంలోనూ రెహమాన్ కంపోజ్ చేసిన ఒక పాటను ఇదే రీతిలో బిల్ బోర్డులో డిస్ ప్లే చేశారు.మరోసారి ఆయన పాట డిస్ప్లే కావడం భారతీయులకు కూడా గర్వకారణం అని చెప్పవచ్చు.