కరోనా మహమ్మారి కల్లోలంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. కొందరు తమ పనులను పక్కన పెట్టి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడుతున్నాయి. అయితే నాని లాంటి కొందరు హీరోలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నారు. జూలై 30న విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ను కూడా కరోనా నిబంధనల మధ్య జరపాలని మేకర్స్ నిర్ణయించారు. కాని ప్రభాస్ వింటేజ్ లుక్లోకి మార్చే మేకప్ మెన్తో చిత్ర షూటింగ్కు బ్రేక్ పడిందని సమాచారం.
రాధే శ్యామ్ చిత్రం గత జన్మల నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. గత ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. అయితే కరోనా కాస్త తగ్గాక చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేయగా, కొంత బ్యాలెన్స్ మిగిలి ఉంది. అది పూర్తి చేద్దామనుకునే లోపే ప్రభాస్ మేకప్మెన్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. ముందు ఈ చిత్ర షూటింగ్ పూజా హెగ్డే వలన ఆగిందని వార్తలు వచ్చాయి. కాని అసలు కారణం ప్రభాస్ మేకప్మెన్ అని టాక్. యూవి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.