Radhe shyam release date | సినిమా ఇండస్ట్రీని కరోనా కష్టాలు వీడటం లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ కేసులు మళ్లీ కలవరం పుట్టిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రాలైన ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ చిత్ర యూనిట్ స్పందించింది. తమ సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చింది.
థియేటర్లకు ఇప్పుడిప్పుడే మంచిరోజులొచ్చాయి. ఇటీవల రిలీజైన అఖండ, పుష్ప సినిమాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు తీసుకొచ్చాయి. దీంతో థియేటర్ల వ్యవస్థకు పునర్వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ దేశమంతటా ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు తీసుకొచ్చాయి. ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను నడిపించాలని నిబంధనలు విధించారు. దీంతో బాలీవుడ్లో డిసెంబర్ 31న విడుదల కావాల్సిన జెర్సీ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రాధేశ్యామ్ నిర్మాతలు స్పందించారు. తమ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తామని యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. సినిమా పోస్ట్పోన్ వార్తలకు తెరదించుతూ రాధేశ్యామ్ సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు. జనవరి 14నే ఈ సినిమా విడుదల అవుతుందని ఈ పోస్టర్తో కన్ఫార్మ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
న్యూ ఇయర్కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్తో బ్రేకప్
Radhe shyam Sequel | రాధేశ్యామ్ సీక్వెల్ రాబోతుందా..?
తండ్రిని మించిన సోగ్గాడిగా మారిన చైతూ.. ఆకట్టుకుంటున్న బంగార్రాజు టీజర్
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా!